
టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సేల్' సందర్భంగా ఈ ఫోన్పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లను కలుపుకుంటే ఈ ఫోన్ కేవలం రూ. 98,300కే వచ్చేస్తోంది. ఇది ఐఫోన్ ప్రియులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.ఆఫర్ వివరాలు ఇలా..యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ మార్కెట్లో రూ. 1,49,900 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఈ ఫోన్పై నేరుగా రూ. 8,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో దీని లిస్టెడ్ ధర రూ. 1,41,900కి తగ్గింది. ఇది కేవలం ప్రాథమిక తగ్గింపు మాత్రమే.దీనికి అదనంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు మరో రూ. 8,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ను వినియోగించుకుంటే ఫోన్ ధర రూ. 1,33,900కి చేరుతుంది. అయితే, అసలు సిసలైన తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తోనే వస్తుంది.మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ. 35,600 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా విజయవంతంగా పొందితే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తుది ధర రూ. 98,300 అవుతుంది. అంటే.. ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ. 51,600 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్పై