
బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది. నటి కాజోల్ తన ఇంట్లోని మెట్లమార్గం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇంట్లోని ఇంటీరియర్ ప్రత్యేకతలపై మీడియాలో మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ బంగ్లాలో ప్రధాన ఆకర్షణ చెక్కతో రూపొందించిన విశాలమైన మెట్లమార్గం. దీనికి అనుబంధంగా పైకప్పు నుంచి నీటి బిందువుల తరహాలో వేలాడే వెలుగుల శ్రేణి ఫోటోషూట్లకు సరైన బ్యాక్డ్రాప్గా మారింది. మొదటి అంతస్తులోని లాబీ మెరిసే తెల్లటి మార్బుల్ ఫ్లోరింగ్తో నిర్మించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఉన్న పెద్ద గ్లాస్ విండోస్ సహజమైన వెలుతురును ఇంటికి అందిస్తాయి. లివింగ్ రూమ్లో ఐవరీ సోఫాలు, ఆరు సీట్ల డైనింగ్ టేబుల్ లగ్జరీ లుక్ను ఇస్తాయి. మినిమలిస్టిక్ థీమ్కు భిన్నంగా రెడ్ లెదర్ సోఫాలతో కూడిన లాంజ్ ఏరియా కుటుంబ సభ్యుల కలయికలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభిరుచులకు అద్దం పట్టేలా నిర్మించిన ఈ నివాసం సెలబ్రిటీ హోమ్ల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్