Nepal Floods Missing Indians 2026 : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో చెలరేగిన వినాశకర ప్రళయం అంతులేని శోకాన్ని మిగుల్చింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వెయ్యి దాటగా.. 4,471 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన 275 మంది భారత పౌరులతో పాటు మరొక 128 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. రోజురోజుకూ నదుల్లో మృతదేహాలు కొట్టుకొస్తుండటంతో నేపాల్ శవాగారాలన్నీ నిండిపోయి, మృతదేహాలను భద్రపరచడం, గుర్తించడం అధికారులకు అత్యంత సంక్లిష్టంగా మారింది. గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం బాధితుల వివరాలతో పవర్ పాయింట్ స్లైడ్షోలను కూడా సిద్ధం చేసింది.మృతదేహాల అప్పగింతకు 9 అంచెల ప్రక్రియ..ఈ విపత్కర పరిస్థితిలో మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ఖాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నేపాల్ ప్రభుత్వం వెబ్సైట్లో విడుదల చేస్తున్న ఫోటోలు, వివరాల ద్వారా మృతదేహాలను గుర్తించిన పక్షంలో.. భౌతికకాయాలను స్వదేశానికి తరలించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తామని ఎంబసీ తెలిపింది. దీనికోసం నేపాల్ ప్రభుత్వం రూపొందించిన 9 అంచెల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మృతదేహ అవశేషాల డాక్యుమెంటేషన్, లభ్యమైన ఫోటోలు, వివరాలను నమోదు చేయాలి. అలాగే పోస్టుమార్టం నిర్వహణ, మరణానికి గల కారణాల నిర్ధారణ, అధికారికంగా వ్యక్తి గుర్తింపు, వేలిముద్రలు, డీఎన్ఏ, ఫోరెన్సిక్ శాంపిళ్ల సేకరణ, మృతుడి పాస్పోర్ట్ లేదా ఐడీ వెరిఫికేషన్, ఎంబసీ లేదా కాన్సులర్ సమన్వయ ప్రక్రియ పూర్తి, హ్యాండోవర్ మెమో, రసీదుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.అయితే వీటిని గుర్తించడానికి బాధితుల మొదటి శ్రేణి బంధువుల డీఎన్ఏ పోలిక తప్పనిసరి. బంధువులు తమ డిఎన్ఏ ప్రొఫైళ్లను dnacodis@nepalpolice.gov.np కి ఇమెయిల్ చేయవచ్చని లేదా నేరుగా రక్త నమూనాలను అందించవచ్చని సూచించారు. భారత ఎంబసీ సాయం కోసం కూడా ఈ వివరాలను eoikathmandufloodsupport@gmail.com కి కాపీ