
Indian Cricket: క్రికెట్ మ్యాచ్లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు ప్రదర్శించే భావోద్వేగాలు కామనే. కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్లు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. బ్యాటర్లను రెచ్చగొట్టేలా వేడుకలు చేసుకొని ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి, భారీ జరిమానాలు, మ్యాచ్ నిషేధాలు ఎదుర్కొన్న ఐదుగురు భారత క్రికెటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అగ్రెసివ్ సెండ్ఆఫ్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసిన తర్వాత అతనికి ఇచ్చిన ఆగ్రహపూరిత సెండ్ఆఫ్ కారణంగా ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్ను కేటాయించింది. అంతకుముందు ఐపిఎల్లో మయాంక్ అగర్వాల్కు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ ఇచ్చి ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తన ప్రముఖ నోట్బుక్ సెలబ్రేషన్తో తీవ్ర చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత ఈ రీతిలో ప్రవర్తించి 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోవడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఢిల్లీ ప్రిమియర్ లీగ్లో ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేసిన సమయంలో కూడా ఇదే సెలబ్రేషన్ పునరావృతం చేసి 30 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాడు. జాతీయ జట్టు కీలక పేసర్ మహమ్మద్ సిరాజ్ మైదానంలో చూపించే తీవ్ర ఆవేశం వల్ల పలుమార్లు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ను అవుట్ చేసిన అనంతరం అతని ముఖానికి అత్యంత సమీపంలోకి వెళ్లి ఆవేశంగా వేడుక చేసుకున్నందుకు గాను ఐసిసి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం ఒక డీమెరిట్ పాయింట్ పొందాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో వేడివేడి సెండ్ఆఫ్ల వల్ల పలుమార్లు ఐసిసి శిక్షలకు గురయ్యాడు. శ్రీలంక పర్యటనలో దినేష్ చండీమాల్, లాహిరు తిరిమాన్నేల