
Indian Cricket Team Injuries: టీమిండియా క్రీడాకారుల గాయాల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఏకంగా ఒక ప్రధాన జట్టునే ఏర్పాటు చేసేంత మంది కీలక ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)కు చేరుకుని వివిఎస్ లక్ష్మణ్తో అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత జట్టును వరుస గాయాలు వెంటాడుతున్న తీరుపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్న ఆటగాళ్ల పునరావాస పురోగతిని సమీక్షించడానికి బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు సంపూర్ణ ఫిట్నెస్ సాధించకముందే వారిని మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? ప్రస్తుతం బెంగళూరులోని సిఓఈ రిహాబ్ సెంటర్లో నలుగుతున్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తుంటి గాయం వల్ల ఆకాష్ దీప్ గత రంజీ ట్రోఫీ సెమీఫైనల్ నుంచి సుదీర్ఘకాలంగా దూరంగా ఉండగా, బుమ్రా మోకాలి వాపు, నీరు చేరిన సమస్యతో సతమతమవుతున్నారు. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో ఇబ్బంది పడుతుంటే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి హామ్స్ట్రింగ్ గాయాలతో పోరాడుతున్నారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు. విదేశీ, పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ కూడా అదే ఆసుపత్రి వాతావరణంలో రిహాబిలిటేషన్లో ఉన్నారు. ఫిట్నెస్ నిర్వహణపై హెడ్ ఆఫీస్ అసంతృప్తి.. నారాయణ్ నితిన్