
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (6/55) అద్భుతమైన బౌలింగ్తో చెలరేగడంతో టీమిండియా మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఖాతాలో 12 కీలక పాయింట్లను జమ చేసుకుంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం, గాలే స్టేడియానికి 50వ టెస్టు కావడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది.నేడు ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ విరామం తర్వాత శ్రీలంక బ్యాటర్లు సోనాల్ దినుష, కేశర నువంత కొద్దిసేపు భారత బౌలర్లను నిలువరించారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించిన దినుష (84) మరోసారి అద్భుతంగా ఆడి, రెండో సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమోననిపించింది.అయితే, యువ కెరటం మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 76వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సుతార్, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఆ ఓవర్లో దినుషను లెగ్ గల్లీలో ధ్రువ్ జురెల్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్యను క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ బంతిని లహిరు కుమార ఎదుర్కొన్నప్పటికీ