
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో ధనంజయ డిసెల్వా(31*), సోనల్ దినూశ(25*) కొనసాగుతున్నారు. నాలుగో రోజు ఛేదనకు దిగిన లంక బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓపెనర్లు నిశాన్ మదుశంక(6), లాహిరు ఉదారా(16), పసిందు సూర్యబందరా(0), కమిందు మెండిస్(2) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు అవసరం కాగా.. భారత్ విజయానికి ఇంకా ఆరు వికెట్లు కావాలి. మంగళవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(66) హాఫ్ సెంచరీ.. దేవదత్ పడిక్కల్(44), కేఎల్ రాహుల్(35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 3, లాహిరు కుమార 2, కేశర ఒక వికెట్ తీశారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని శ్రీలంకకు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు 17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!