
అండమాన్ నికోబార్ దీవుల మధ్య నీలి సముద్రంలో ఒక విచిత్రమైన, భయానక ప్రపంచం ఉంది. ఆధునిక సాంకేతికతకు, నేటి నాగరిక సమాజానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. ఇది భారత్లోనే అత్యంత ప్రమాదకరమైన, రహస్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది. ఈ ఇన్నేళ్లలో దేశంలోని మూ మూలలకు ఆధునిక పాలన, చట్టాలు, టెక్నాలజీ వ్యవస్థలు చేరాయి. కానీ, భారత పటంలో భాగమైనా కూడా ఏ ప్రభుత్వానికీ లొంగని ఒక రహస్య ద్వీపం ఉంది. తన ఇష్టానుసారం స్వతంత్రంగా జీవించే ఆ ప్రదేశం గురించి చాలామందికి తెలియదు. అక్కడ పాలన చేయడం అటుంచితే, ఆ ప్రజలను కనీసం సంప్రదించడం కూడా సాధ్యం కాలేదు. వారిని కలిసేందుకు వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ మరణాల ద్వీపం విశేషాలు ఇప్పుడు చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఉన్న ఈ భయంకర ప్రదేశమే ‘నార్త్ సెంటినెల్ ఐలాండ్’. ఆధునిక సాంకేతికతకు, నేటి సమాజానికి పూర్తిగా దూరంగా ఉండే అత్యంత ప్రమాదకర ప్రాంతం ఇది. ఇక్కడ నివసించే వారిని ‘సెంటినెలీస్’ తెగ అంటారు. వీరు గత 60,000 ఏళ్లుగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో కూడా వీరు చరిత్ర పూర్వ యుగం నాటి మానవుల లాగే వేటాడుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ద్వీప ప్రజలకు బయటి ప్రపంచ మానవులంటే తీవ్రమైన ద్వేషం, భయం. వారి ద్వీపానికి దగ్గరగా హెలికాప్టర్లు ఎగిరినా లేదా పడవలు వెళ్లినా సరే.. వారు విల్లు-బాణాలు, ఈటెలు, భయంకరమైన ఆయుధాలతో దాడి చేస్తారు. 2006 లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న ఇద్దరు భారతీయ జాలర్ల పడవ ప్రమాదవశాత్తూ ఈ ద్వీపం తీరానికి కొట్టుకుపోయింది. దాంతో ఆ తెగ ప్రజలు ఆ ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. తరువాత 2018 లో జాన్ అలెన్ చౌ