
రెండేళ్ల కిందటి తరానికి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం. పింఛను గ్యారంటీ. ఆ తర్వాత తరానికి ఉద్యోగం అంటే ప్రైవేట్ కంపెనీలో నెలనెలా వచ్చే జీతం. మరి ఈనాటి జనరేషన్ పరిస్థితి ఏంటి? ఇవాళ సెక్యూరిటీ అంటే ఒక ఒకే కంపెనీలో ఉండే ఉద్యోగం కాదు, నేర్చుకున్న స్కిల్స్, ఆ తర్వాత దక్కించుకునే కొత్త గిగ్ వర్క్. ఒకే ప్రశ్నకు మూడు తరాలు పూర్తి భిన్నమైన సమాధానాలు ఇచ్చాయి. ఒక ఉద్యోగం మనిషికి నిజంగా ఏమి గ్యారంటీ ఇస్తుంది? భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ రంగం వేర్వేరు దశలను చూసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆయా కాలాల్లో ఏ రంగాలు ఆధిపత్యం చెలాయించాయనే దానికంటే, ఆ ఉద్యోగాలు కార్మికులకు ఏమి అందించాయనేదే ఇక్కడ ముఖ్యం. 1947 నుంచి 1980 వరకు ఉన్న కాలాన్ని సెక్యూరిటీ యుగం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం మాత్రమే సామాజిక భద్రతకు పునాదిగా ఉండేవి. ఒకసారి ఉద్యోగంలో చేరితే జీవితాంతం ఒకే సంస్థలో పనిచేయడమే అప్పటి సంప్రదాయం. ఆనాటి ముద్ర నేటికీ పూర్తిగా చెరిగిపోలేదు. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా ఐదవ వంతు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, నేటికీ 46 శాతం మంది ఉపాధి కోసం దానిపైనే ఆధారపడుతున్నారు. 1991 ఆర్థిక సంస్కరణలకు ముందు పరిస్థితి ఇది. 1983-84 ఆర్బిఐ డేటా ప్రకారం, పది మందిలో ఏడుగురు భూమిపైనే ఆధారపడ్డారు. వర్షాలపైనే ఆధారపడే ఈ ఉపాధికి మార్కెట్తో సంబంధం ఉండేది కాదు. అప్పట్లో నేషనల్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ (1945), క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ (1950), అప్రెంటిస్షిప్ యాక్ట్ (1961) వంటివి పరిమిత ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేవి. 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత ఉద్యోగ రంగాన్ని మలుపు తిప్పాయి. ఉద్యోగం అంటే ప్రభుత్వం కేటాయించడం కాదు, ఓపెన్ మార్కెట్లో ప్రతిభ ద్వారా సంపాదించుకోవడం అనే కొత్త శకం ఇక్కడే మొదలైంది. సంస్కరణల