
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పై భారత్ పూర్తి పట్టు సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి కష్టాల్లో పడింది. విజయానికి టీమిండియా కేవలం 6 వికెట్ల దూరంలో నిలవగా, లంక గెలవాలంటే చివరి రోజు ఇంకా 288 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో నాలుగో రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలింగ్ ప్రారంభించిన భారత్కు పేసర్ మహమ్మద్ సిరాజ్, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన శుభారంభం అందించారు. సిరాజ్ తన బౌన్సర్తో నిషాన్ మదుష్క (6)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా, ఆ తర్వాతి ఓవర్లోనే మానవ్ సుతార్.. దినేష్ చండీమాల్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన పసిందు సూరియబండార (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ.. కమిందు మెండిస్ (2)ను కీపర్ క్యాచ్గా ఔట్ చేయడంతో శ్రీలంక 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ దశలో లహిరు ఉడార (16), కెప్టెన్ ధనంజయ డిసిల్వా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, మరోసారి బౌలింగ్కు వచ్చిన మానవ్ సుతార్ ఈ జోడీని విడదీసి తన రెండో వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సోనాల్ దినుష (25 నాటౌట్)తో కలిసి ధనంజయ డిసిల్వా (31 నాటౌట్) పోరాడటంతో