© 2026 nimisham.in
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకు కుప్పకూలింది. మానవ్ సుతార్ ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్లో 284 పరుగులకే పరిమితం చేశారు. దీంతో 178 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. చివరి వరకూ అదే జోరు కొనసాగించింది.రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన లీడ్తో కలిసి శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక.. 206 పరుగులకు కుప్పకూలింది. నాలుగో రోజే కీలక వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనించిన శ్రీలంక, ఆఖరి రోజున మిగిలిన వికెట్లను కూడా చకచకా సమర్పించుకుంది. దీంతో 165 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా స్పిన్నర్ మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.తన 600వ టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించి.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్కు కీలకమైన 12 పాయింట్లు దక్కాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది
.