
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. మానవ్ సుతార్ ఫైఫర్ (6/55) నమోదు చేశాడు. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుష (84), ధనంజయ డిసిల్వా (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారనప్పటికీ.. పర్సంటేజీని మాత్రం బాగా పెంచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మరోసారి అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో (76వ) మూడు వికెట్లు తీశాడు. సోనాల్ దినుష (84), ప్రభాత్ జయసూర్య (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అతడు.. ఓవర్ చివరి బంతికి లాహిరు కుమార (0)ను పెవిలియన్కు చేర్చాడు. సోనాల్ క్యాచ్ను స్లిప్లో ధ్రువ్ జురెల్ అందుకొన్నాడు. ప్రభాత్ జయసూర్య బౌల్డ్ అయ్యాడు. ఇక లాహిరు ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ పంత్ అందుకొన్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 199/9. శ్రీలంక బ్యాటర్లు వికెట్ ఇవ్వకుండా పట్టుదల ప్రదర్శిస్తున్నారు. భారత బౌలర్లు మాత్రం శతవిధాలా ఏడో వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఆరు ఓవర్లపాటు ఆట జరిగింది. కేశర నువాంత (12*), సోనాల్ దినుష (80*) మాత్రం