
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే ఆలౌటైనప్పటికీ, తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంతో కలిపి లంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (66) తనదైన శైలిలో మెరుపు అర్ధ శతకం సాధించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) డకౌట్గా వెనుదిరగ్గా, కెప్టెన్ శుభ్మన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ (35) కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ప్రబాత్ జయసూర్య అతడిని పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 81 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవ్దత్ పడిక్కల్ (44) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.అయితే అతడు ఔటైన తర్వాత వచ్చిన రిషభ్ పంత్ తన మార్క్ విధ్వంసం సృష్టించాడు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 20వ అర్ధ శతకాన్ని, 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. పంత్ జోరు చూస్తే భారత్ స్కోరు మరింత పెరిగేలా కనిపించినా, లహిరు కుమార బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ వెంటనే లంక బౌలర్లు అసిత ఫెర్నాండో (4/31), ప్రబాత్ జయసూర్య (3/43) విజృంభించడంతో భారత