న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూ ఇంగ్లాండ్లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ( FIA ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్ బియాండ్ బార్డర్స్ 2.0’ గాలా వేడుకతో భారత స్వాతంత్య్ర దినోత్సవ వారాంతపు సంబరాలు ఆగస్టు 16 సాయంత్రం సిప్రియాని వాల్ స్ట్రీట్లో ఘనంగా ముగిశాయి. భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్పాన్సర్లు, భారతీయ సమాజ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం మాస్టర్ ఆఫ్ సెరిమొనీ ప్రారంభోపన్యాసం, భారత కాన్సులేట్ జనరల్, బన్సాల్ ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వ్యవస్థాపక స్పాన్సర్ల గౌరవ సత్కారాలతో ప్రారంభమైంది. హెరిటేజ్ ఆర్ట్స్ అకాడమీ సమర్పించిన భారతీయ రాగ్ కీరవాణి వాయిద్య ప్రదర్శన, అమెరికా, భారత జాతీయ గీతాల ఆలపన, అనంతరం పలు రాగాల సమ్మేళన వాయిద్య ప్రదర్శన సభను అలరించాయి. ఈ సందర్భంగా న్యూయార్క్ గవర్నర్ కేతీ హోచుల్.. భారత కాన్సుల్ జనరల్, డిప్యూటీ కాన్సుల్ జనరల్, ఎంపీ హర్షవర్ధన్, NYC పబ్లిక్ అడ్వకేట్ జుమానే విలియమ్స్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ పంపిన అధికారిక వీడియో సందేశాలను ప్రదర్శించారు.ఈ వేడుకలో FIA ఛైర్మన్ అంకుర్ వైద్య, FIA ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి, ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ గౌరవ్ వశిష్ట్, హార్డ్ రాక్ ప్రతినిధులు ప్రసంగించారు. బ్రాడ్వే తరహా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రీతి పటేల్ ఆలపించిన ‘గోకుల్ ధామ్ అన్ప్లగ్డ్’ సంగీత ప్రదర్శన, యువ బృందం సంగీత, మారియాచి బ్యాండ్ ప్రదర్శన, బెస్ట్ డ్రెస్డ్ పోటీలు ఈ ఈవెంట్లో ఆకట్టుకున్నాయి. అలాగే పూజా హెగ్డే (ఫైర్సైడ్ చాట్లో పాల్గొన్నారు), అడివి శేష్, అవినాష్ తివారీ, 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' బృందం వంటి పలువురు సినీ, వివిధ రంగాల ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా విచ్చేసిన అతిథులందరినీ FIA నాయకత్వం ఘనంగా సన్మానించింది.న్యూయార్క్