
Ravindra Jadeja : భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్కు గాలే ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 8 నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన టీమ్ఇండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఈ సిరీస్కు ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. నాలుగు వికెట్లు తీస్తే.. టెస్టుల్లో శ్రీలంక జట్టు పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంటాడు. లంక పై ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన జడేజా 33 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ సగటు 23.72గా ఉండగా, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఇషాంత్ శర్మ 36 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో అనిల్ కుంబ్లే 74 వికెట్లతో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ 62, హర్భజన్ సింగ్ 53, కపిల్ దేవ్ 45 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. West Indies : వన్డే ప్రపంచకప్ 2027కి నేరుగా అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్.. అయినా గానీ.. ఇక భారత్-శ్రీలంక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. అతడు ఏకంగా 105 వికెట్లు సాధించాడు. జడేజా మరో కీలక మైలురాయికి కూడా అత్యంత చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో 350 వికెట్లు పూర్తి చేసేందుకు అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ఆ ఘనత సాధిస్తే టెస్టు క్రికెట్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జడేజా ఐదో ప్లేయర్గా నిలుస్తాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 348 వికెట్లు ఉన్నాయి. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ జడేజా మరో మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో