
IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పరంగా ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. అదే సమయంలో భారత ఆటగాళ్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ప్రత్యేకమైన సిరీస్గా మారనుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు పలు కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. గిల్ టార్గెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో రెండు కీలక రికార్డులపై కన్నేశాడు. ప్రస్తుత WTC సైకిల్లో గిల్ ఇప్పటికే ఐదు సెంచరీలు చేశాడు. శ్రీలంకపై మరో సెంచరీ సాధిస్తే ఈ WTC సైకిల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా జో రూట్ను అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో కెప్టెన్గా మరో రెండు సెంచరీలు సాధిస్తే టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ అధిగమించే అవకాశం ఉంది. సచిన్ కెప్టెన్గా ఏడు టెస్టు సెంచరీలు సాధించగా, గిల్ ఇప్పటికే ఆరు సెంచరీలతో ఉన్నాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్లో చారిత్రాత్మక మైలురాయికి చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగే టెస్టుల్లో మరో రెండు వికెట్లు తీస్తే జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల మార్క్ను అందుకుంటాడు. ఈ ఘనత సాధిస్తే 350 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన జడేజా నిలుస్తాడు. శ్రీలంకపై ఇషాంత్ శర్మ రికార్డుపై కూడా జడేజా కన్ను శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జడేజా