© 2026 nimisham.in

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణలను తుది జట్టులోకి తీసుకున్నారు. సంజూ శాంసన్కు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలం అయినా కూడా వైభవ్ సూర్యవంశీ పై మేనేజ్మెంట్ నమ్మకాన్ని ఉంచింది. 🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bat first in Bristol. Updates ▶️ #ENGvIND — BCCI (@BCCI) July 9, 2026 Team India : లార్డ్స్లో తొలిసారి మహిళల టెస్టు క్రికెట్.. భారత మహిళా క్రికెటర్ల ఫోటోలు వైరల్.. 'మేం తొలుత బ్యాటింగ్ చేస్తాం. మొదటి రెండు మ్యాచ్లలో మేము అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. కానీ ఈ రోజు ఒక కొత్త రోజు, కొత్త ప్రారంభం. ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వికెట్ చూసేందుకు బాగుంది. పిచ్ మీద గడ్డి ఉంది. కాబట్టి తొలి బంతి నుంచే అది ఎలా ఆడుతుందో ఖచ్చితంగా చూస్తాము. ఇక తుది జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వరుణ్, అర్ష్దీప్ స్థానాల్లో వాషింగ్టన్, ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చారు.' అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లాండ్ తుది జట్టు.. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. Here's a look at #TeamIndia's Playing XI for the 4️⃣th T20I 🙌 Updates ▶️ #ENGvIND — BCCI (@BCCI) July 9, 2026 భారత తుది
జట్టు.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.