హైదరాబాద్ గచ్చిబౌలిలోనిఅంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయన్న రంగనాథ్.. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నాలాను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు . శనివారం కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనాన్ని.. సాజిద్ అనే బిల్డర్ కట్టినట్లు రంగనాథ్ తెలిపారు. సాజిద్ కట్టిన భవనాలు అన్నీ ఇదే తరహాలో ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారని.. కొద్దిరోజుల్లో వాటిని కూల్చేస్తామని తెలిపారు.50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించడమే కాకుండా పైన పెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నాయని.. చాలావాటికి సెట్బ్యాక్లు లేవని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అంజయ్య నగర్లోని భవనాలు హాస్టల్స్ కోసం ఉపయోగిస్తున్నారన్న రంగనాథ్.. వాటిని ఖాళీ చేయాలని యజమానులకు సూచించారు. నాలాను ఆక్రమించి భవనాలు కట్టారని.. అంజయ్య నగర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.మరోవైపు గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మధ్యప్రదేశ్కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42) అనే ఇద్దరు టైల్స్ కార్మికులు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్పై పడ్డాయి. దీంతో అపార్టుమెంటులో నివశిస్తున్న ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ గోడలు కూడా ధ్వంసమయ్యాయి. భవనం నిర్మించిన సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.మరోవైపు సాజిద్ బిల్డింగులు అన్నింటిని పరిశీలిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పష్టం