
Hyderabad Real Estate : నిజాంల నగరం హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఓవైపు ఓల్డ్ సిటీ నగర చారిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే మరోవైపు ఐటీ సిటీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇలా పాత కొత్తల కలయికతో హైదరాబాద్ నగరం ముందుకు సాగుతోంది... డెవలప్మెంట్ కు కొత్త అర్థం చెబుతోంది. హైదరాబాద్ అభివృద్ధి గురించి తెలియాలంటే ఇక్కడి రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు కొండలు, గుట్టలతో బీడుభూమిగా ఉన్నప్రాంతం ఐటీ విప్లవంతో కోట్లకు పడగలెత్తింది. ఒకప్పుడు హైదరాబాద్ లో రిచ్చెస్ట్ ఏరియా అంటే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్... కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, రాయదుర్గం వంటి ప్రాంతాలు వాటిని తలదన్నేలా మారాయి. ఇక్కడ భూముల ధరలు వందలు కోట్లు పలుకుతున్నాయి. గతంలో హైదరాబాద్ శివారు కోకాపేట నియోపోలిస్ లో ఎకరా భూమి రూ.100 కోట్లు పలికితేనే అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత రాయదుర్గం నాలెజ్డ్ సిటీలో టిజిఐఐసి నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు స్థాయిలో రూ.237 కోట్లకు ఎకరం పలికింది. ఈ ధర రియల్ ఎస్టేట్ పండితులనే అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఆల్ టైమ్ రికార్డును బద్దలుగొట్టేందుకు రంగం సిద్దం అవుతోంది... అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంలో భూమిని అమ్మబోతోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం లోని ఐటిసి కోహినూర్ ఎదురుగా సర్వే నెంబర్ 83/1 లో గల 10.63 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఇటీవల మే నెలలో ఈ ప్రాంతంలోని భూమిని ఎకరం కనీస ధర రూ.139 కోట్లకు వేలం పెడితే ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. కాబట్టి ఈ నెలలో నిర్వహించే వేలంలో కనీస ధర రూ.175 కోట్లుగా నిర్ణయించింది టిజిఐఐసి. అయినా ఈ రాయదుర్గం భూమిని దక్కించుకునేందుకు పలు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి... దీంతో ఈసారి ఆల్ టైమ్ రికార్డు ధర నమోదయ్యే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణుల