
క్రికెట్ను సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకొచ్చే బంతి శరీరంలోని కీలక భాగాలకు తగిలితే ప్రాణాంతకంగా మారొచ్చు. చారిత్రక రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్ ఆడుతూ బంతి తాకిడితో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక చారిత్రక అధ్యయనం ప్రకారం 1858 నుంచి 2016 మధ్య మొత్తం 174 క్రికెట్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఫిలిప్ హ్యూస్.. ప్రపంచాన్ని కుదిపేసిన విషాదం క్రికెట్ బంతి తాకిడితో జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ మ్యాచ్లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ అతని మెడ భాగంలో బలంగా తగిలింది. వెన్నుపూస సమీపంలోని రక్తనాళానికి తీవ్రమైన గాయం కావడంతో హ్యూస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత మరణించాడు. ఈ ఘటన తర్వాత బ్యాటర్ల భద్రతపై క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా హెల్మెట్ల డిజైన్, మెడ రక్షణకు సంబంధించిన పరికరాలపై మరింత దృష్టి పెట్టారు. రమణ్ లాంబా.. ఫీల్డింగ్లోనే ప్రాణాలు కోల్పోయాడు ఫిబ్రవరి 23, 1998న భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయస్సులో టీమిండియా కీలక ఆటగాడు రామన్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్లో ఉన్న లాంబాకు తాకి