
చుట్టూ మైళ్ల కొద్దీ అరేబియా సముద్రం.. నోట్లో చుక్క కూడా పోసుకోలేని ఉప్పు నీరు, కానీ ఆ సముద్రం మధ్యలో ఒక చారిత్రక కోట.. ఆ కోటలోకి అడుగుపెడితే..తీయని నీరు దొరుకుతుంది. పాలు, పెరుగు, పంచదార పేర్లతో పిలిచే ఆ మూడు తీపి నీటి బావుల వెనక కథేంటి? ఉప్పు నీటి మధ్యలో తియ్యటి నీరు ఎలా సాధ్యం అయ్యింది? దీని వెనక సైన్స్ ఏంటి? మహారాష్ట్రలోని మాల్వన్ తీరానికి కాస్త దూరంలో, అరేబియా సముద్రంలో ఉమ్మడి ద్వీపంపై నిర్మించినదే 'సింధుదుర్గ్ కోట' . ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనిక వ్యూహంతో నిర్మించిన ఈ కోటలో శత్రువులు ఊహించని ఒక ప్రత్యేకత ఉంది. కోట లోపల దూధ్బావ్ (Milk Well), సాఖర్బావ్ (Sugar Well), దహీబావ్ (Curd Well) అని పిలిచే మూడు ప్రత్యేకమైన బావులు ఉన్నాయి. సముద్రపు ఒడ్డున ఎంత తవ్వినా ఉప్పునీరే పడే చోట.. ఈ బావుల్లో మాత్రం తీయని తాగునీరు లభిస్తుంది. చాలామంది ఇది ఏదో దైవిక శక్తుల వల్ల లేదా అద్భుతం వల్ల జరుగుతోందని నమ్ముతారు. కానీ దీని వెనుక ఉన్నది సైన్స్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెష్వాటర్ లెన్స్ : లక్షద్వీప్ వంటి సముద్ర ద్వీపాల్లోనూ ఈ ఫినామినా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు కోటలోని రాళ్లు, ఇసుక పొరల గుండా నీరు ఇంకి భూమి అడుగు భాగానికి చేరుతుంది. సాంద్రతలో తేడా: సముద్రపు ఉప్పునీటి సాంద్రత (Density) ఎక్కువ.. వర్షపు మంచినీటి సాంద్రత తక్కువ. అందువల్ల భూగర్భంలో చేరిన మంచినీరు, సముద్రపు ఉప్పునీటిపై ఒక పలుచని పొరలా తేలియాడుతూ నిల్వ ఉంటుంది. బావులు తవ్వినప్పుడు ఈ మంచినీటి పొర నుంచే నీరు ఊరుతుంది. కోట నిర్మాణ సమయంలో శత్రువులు నెలల తరబడి ముట్టడి వేస్తే లోపల ఉన్న సైన్యానికి ప్రాణాధారం 'తాగునీరు'. కోట బయటకు వెళ్లకుండా సైనికులు ఏళ్ల తరబడి పోరాడేందుకు, ప్రకృతి సిద్ధమైన ఈ