
పండుగలప్పుడు లేదా ప్రత్యేక సందర్భాలలో తీపి వంటకాలంటే ముందుగా గుర్తొచ్చేది పూర్ణం బూరెలు. అయితే డీప్ ఫ్రై చేసే బూరెలను నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం, అలాగే డైట్లో ఉన్నవారి కోసం ఒక్క స్పూన్ నూనెతో రుచిగా, ఆరోగ్యకరంగా, క్రిస్పీగా పూర్ణం బూరెలను పనారం పాన్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. * ఇడ్లీ రవ్వ: ఒక గ్లాసు (లేదా సగం తగ్గించి అర గ్లాసు) ముందుగా, ఒక గ్లాసు పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి, అదే గ్లాసుతో రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. నానిన పప్పును కుక్కర్లో వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి, కానీ నీళ్లలా మారకూడదు. ప్రెజర్ పోయిన తర్వాత, అదనపు నీటిని వడకట్టి పప్పును ఒక ప్లేట్లో వేసి చల్లార్చాలి. ఇది ఇప్పటికే మెత్తగా ఉడికినందున మాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే పప్పు గుత్తితో మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, ఒక గ్లాసు బెల్లానికి రెండు స్పూన్ల నీళ్లు కలిపి సన్నని మంటపై కరిగించాలి. బెల్లం కరిగి నురగలు రావడం మొదలైన తర్వాత ఉడికించిన శనగపప్పును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు ఏడు, ఎనిమిది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. దగ్గరపడిన తర్వాత పావు స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసి మరో రెండు, మూడు నిమిషాలు కలిపి స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకుని, అవి డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు మంచి క్వాలిటీ మినపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. మరొక