© 2026 nimisham.in

స్వీడన్లో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ అక్కడి పన్నుల విధానంపై చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. పౌరులు చెల్లించే పన్నులకు ప్రతిగా ప్రభుత్వాల నుంచి అందుతున్న సేవలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.గోపీ కపాడియా అనే భారతీయ మహిళ ప్రస్తుతం స్వీడన్లో నివసిస్తున్నారు. ఆమె ఇటీవల ఫేస్బుక్ వేదికగా చేసిన ఒక పోస్టులో, తాను గతంలో భారత్లో సుమారు 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించేదాన్నని, ఇప్పుడు స్వీడన్లోనూ దాదాపు అంతే పన్ను చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, స్వీడన్లో పన్నులు చెల్లించడం వల్ల స్వచ్ఛమైన గాలి, శుద్ధి చేసిన నీరు, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన వైద్యం, పిల్లలకు ఉచిత విద్య, సామాజిక భద్రత వంటి విశేష ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు.ఈ నేపథ్యంలో, "భారత్లో 30 శాతం పన్ను చెల్లిస్తున్న మనం దానికి ప్రతిగా ఏం పొందుతున్నాం?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్ట్ స్వల్ప కాలంలోనే వైరల్ కాగా, అనేక మంది నెటిజన్లు ఆమె వాదనతో ఏకీభవించారు. భారత్లో ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నాణ్యతపై వారు విమర్శలు గుప్పించారు. "కారు ఇంజిన్లను పాడుచేసే ఇథనాల్ కలిపిన ఇంధనం తప్ప మనకు దక్కేదేముంది?" అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా, మరికొందరు నెటిజన్లు ఈ పోలిక ఏమాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. స్వీడన్లో జనాభా చాలా తక్కువని, అందుకే అక్కడ పరిపాలన సులభంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. భారీ జనాభా కలిగిన భారత్తో