
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్త తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. మధుమేహం బారిన పడకముందు శరీరంలో పెరిగే ఇన్సులీన్ రెసిస్టెన్స్ను గుర్తించే ఫీచర్ను పిక్సెల్ వాచ్ 5లో జోడించింది. రక్త పరీక్ష అవసరం లేకుండా పిక్సెల్ వాచ్ సాయంతో ఇన్సులీన్ రెసిస్టెన్స్ను అంచనా వేసేలా ఈ ఫీచర్ను ప్రత్యేక ఆల్గొరిథమ్తో తీర్చిదిద్దింది. ఆరోగ్యంపై కన్నేసి ఉంచేందుకు ఉద్దేశించిన హెల్త్ గార్డియన్ సూట్ ఉత్పత్తుల్లో భాగంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఈ ఫీచర్ పిక్సెల్ వాచ్ 3 మొదలు ఆ తరువాత మోడల్స్ అన్నిటిలోనూ ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. రక్తంలోని చక్కెరలను శరీరంలోని కణాల్లోకి చేర్చి వాటికి తగినంత శక్తి అందేలా చేసే హార్మోన్ ఇన్సులీన్. అయితే, శరీరంపై ఈ హార్మోన్ ప్రభావం తగ్గడాన్ని ఇన్సులీన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఈ రెసిస్టెన్స్ పెరుగుతున్నప్పుడు రక్తంలోని చక్కెరను కణాల్లోకి చేర్చేందుకు శరీరం అదనంగా ఇన్సులీన్ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మరోలా చెప్పాలంటే, రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో పెట్టేందుకు శరీరం మరింత శ్రమపడాల్సి వస్తుంది. దీర్ఘకాలం పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యక్తులు క్రమంగా బరువు పెరుగుతారు. అంతిమంగా టైప్-2 మధుమేహం బారినపడతారు. పైకి ఎలాంటి సూచనలూ లేకుండానే శరీరంలో ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తమకు ఈ సమస్య ఉన్న విషయాన్ని చాలా మంది గుర్తించలేరని కూడా అంటున్నారు. గూగుల్ అంచనా ప్రకారం, దాదాపు 40 శాతం మంది వయోజనులకు