
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు ఆదివారం, ఆగస్టు 9న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.152,150కి చేరింది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.139,471కి చేరింది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.232,640కి చేరింది. బంగారం ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో డాలర్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఈ పెరుగుదలకు ఒక కారణం. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని.. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. బంగారం ధర కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, జూలై నెలకు సంబంధించిన యూఎస్ ఉద్యోగాల డేటా అంచనాల కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా, సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందని చెబుతున్నారు. పర్యవసానంగా, మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా. అయితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్లో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చని లేదా మరింత తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల, సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ప్రోత్సాహం పొందవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల యూఎస్ బాండ్లపై రాబడి తగ్గడమే. ఇది డాలర్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు, యూఎస్ బాండ్లపై రాబడి కూడా తగ్గుతుంది. పెట్టుబడిదారులు