
మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే ఇది కేవలం దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల వచ్చిన పెరుగుదల కాదు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బంగారం ధర వెనుక ఒకేసారి చాలా కారణాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు మళ్లీ కీలకంగా మారాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హోర్ముజ్ మార్గంలో నౌకలపై దాడుల వార్తలు వస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గంపైనే ఆధారపడి ఉండటంతో మార్కెట్లలో ఆందోళన పెరుగుతోంది. దీని ప్రభావం నేరుగా ముడి చమురు ధరలపై పడుతోంది. ఆగస్టు 14న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 88 డాలర్లకు పైగా చేరగా.. వారంలోనే దాదాపు 6 శాతం పెరిగింది. చమురు ధరలు ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న భయం మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం లేదా మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తే.. పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు చూస్తారు. బంగారం అలాంటి ప్రధాన Safe Haven Asset. అందుకే భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్ అంచనాలు మారుతున్నాయి. తాజాగా వచ్చిన అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన డేటా కారణంగా సెప్టెంబర్లో వెంటనే రేటు పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. డాలర్ కూడా కొంత బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ లభించింది. అంతేకాదు.. సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు 289 టన్నులకు చేరాయి. వచ్చే ఏడాదిలో తమ గోల్డ్ నిల్వలను పెంచాలని దాదాపు