
ఆసుపత్రులు, క్లినిక్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నిరంతరం శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రదేశాలు, వస్తువులు సూక్ష్మక్రిములకు నిలయాలుగా మారే ప్రమాదం ఉంది. రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తరచూ తాకడం వల్ల ఈ వస్తువులపై కంటికి కనిపించని క్రిములు పేరుకుపోతాయి. అందుకే.. వైద్యశాలలకు వెళ్లినప్పుడు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.హాస్పిటల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మనం ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. ముఖ్యంగా గదుల డోర్ హ్యాండిల్స్, లోపలికి నెట్టే ప్లేట్లను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. అలాగే, వెయిటింగ్ రూమ్లోని కుర్చీలు, వాటి హ్యాండిల్స్ను ఎంతోమంది పట్టుకుంటారు. కూర్చోవడానికి, లేవడానికి వాటిపై చేతులు ఆనించడం సర్వసాధారణం. రిసెప్షన్ కౌంటర్ల వద్ద చేతులు, ఫోన్లు, పర్సులు, డాక్యుమెంట్లు వంటివి పదేపదే తాకుతూ ఉంటారు. ఇవన్నీ సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి కారణమవుతాయి.రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద అందరూ పంచుకునే పెన్నులు కూడా ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి ఒక ముఖ్య కారణం. అదేవిధంగా, లిఫ్ట్లలోని బటన్లను వందల మంది వేర్వేరు వ్యక్తులు నొక్కుతారు. వాటిని ఎప్పుడు శుభ్రం చేశారో కూడా తెలియదు. మంచినీటి కోసం ఉపయోగించే వాటర్ కూలర్ ట్యాపులు లేదా డిస్పెన్సర్ బటన్లు కూడా క్రిములకు నిలయాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్, ఫీడ్బ్యాక్ కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్లెట్ స్క్రీన్లు, డిజిటల్ పరికరాలను కూడా చాలామంది తాకడం వల్ల ముప్పు పొంచి ఉంది.వీటన్నిటితో పాటు బాత్రూమ్ డోర్ హ్యాండిల్స్, ట్యాపుల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. అయితే, ఈ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి