
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదల్లో తల్లిదండ్రులు గల్లంతైనా.. ఆ బాధను అదిమిపెట్టి ఓ యువతి నీట్ పరీక్ష రాసింది. కైలాస మానసరోవర యాత్ర కోసం వెళ్లిన వందలాది మంది భారతీయులు నేపాల్ వరదల్లో (Nepal floods) గల్లంతయ్యారు. ఈ యాత్రకు వెళ్లిన తన తల్లిదండ్రులు కూడా చిక్కుకుపోయారని తన్వి అనే నీట్ అభ్యర్థి (Medical Aspirant Tanvi) సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు వెంకట్రామ్ అన్నందేవర, అనఘ 67 మందితో కూడిన బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు తెలిపారు. వారు నేపాల్లోని ఇమిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్నప్పుడు చివరిసారిగా తనతో మాట్లాడారని తెలిపింది. ప్రస్తుతం వారు తన పక్కన లేకపోయినా.. వారి కోరిక మేరకు నీట్ పరీక్ష (NEET PG 2026) రాశానని చెప్పారు. ‘మూడు గంటల పరీక్షా సమయంలో దాదాపు సగం సమయం కన్నీళ్లతోనే గడిపాను. అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోను నా తండ్రే తీశారు. పరీక్ష రాస్తున్నప్పుడు అది కనిపించి, ఆయన పదే పదే గుర్తుకు రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. మానసికంగా ఎంతో సంఘర్షణకు గురైనప్పటికీ.. అమ్మానాన్మ కోరిక మేరకు ఈ పరీక్ష తప్పకుండా రాయాలని నిర్ణయించుకున్నా. నా భవిష్యత్తు కోసం వారు ఎన్నో కలలు కన్నారు. నేను ఏ పరీక్షకు వెళ్లినా.. అందులో మంచి మార్కులు సాధించాలని కోరుతూ అమ్మ ప్రతిసారి పెరుగులో పంచదార కలిపి తినిపించేది. కానీ ఇప్పుడు ఆమె నా పక్కన లేకపోవడం నన్ను మరింత కుంగదీసింది. వారు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నా’ అని తన్వి కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: అమ్మో 26 వ తారీఖు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత