Aug 9 2026 5:01 PM | Updated on Aug 9 2026 5:01 PM
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు.
ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం.
టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్ తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు.
విజయం దిశగా భారత్ 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు.
30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు.
టార్గెట్ 207 లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.
పడిక్కల్ అజేయ శతకం భారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.
దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..?
BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..?
నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?