
కొండ పైనుంచి కిందపడి కుమారుడు, దంపతుల దుర్మరణం ఈటీవీ భారత్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐ ఫోను ఈఎంఐ చెల్లింపు కోసం తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్ (19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడేందుకు స్థానిక ఖవడ్యా డోంగర్ కొండ అంచుకు వెళ్లాడు. కిందికి దిగి రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతగా బతిమాలినా వినలేదు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వలలు సిద్ధం చేయగా.. పైన ఉన్న కునాల్ పదే పదే స్థానాలు మారుస్తూ వచ్చాడు. దీంతో కుమారుడిని రక్షించేందుకు తండ్రి మురళీధర్ (48) కూడా కొండపైకి వెళ్లి తీవ్ర ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ కొండపై నుంచి జారిపడి మృతిచెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్రంగా కలత చెందిన యువకుడి తల్లి సంగీత అదే కొండపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అందరూ చూస్తుండగా.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా మృతిచెందడం స్థానికులను కలచివేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు