
India vs Sri Lanka: ఒకప్పుడు టీమిండియాను ప్రపంచ ఛాంపియన్లుగా నిలిపిన గ్యారీ కిర్స్టన్.. ఇప్పుడు అదే భారత జట్టును ఓడించేందుకు వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు కిర్స్టన్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో శ్రీలంక క్రికెట్ XIతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. మ్యాచ్ చివరి రోజైన ఆగస్టు 9న ప్రస్తుత శ్రీలంక హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ మైదానానికి వచ్చారు. భారత ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా గమనించిన ఆయన.. బౌండరీ లైన్ వద్ద తిరుగుతూ మ్యాచ్ను పరిశీలించారు. కిర్స్టన్ మైదానంలో ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా భారత ఆటగాళ్లను గమనించారు. మధ్యమధ్యలో స్కోర్బోర్డును పరిశీలిస్తూ, మ్యాచ్ పరిస్థితులను అంచనా వేశారు. అక్కడున్న భారత మీడియా ప్రతినిధులు ఆయనను గుర్తించి ఫొటోలు దిగేందుకు ప్రయత్నించగా.. కిర్స్టన్ కూడా వారిని నిరాశపరచలేదు. భారత ఆటగాళ్లతో కిర్స్టన్ ముచ్చట్లు ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కిర్స్టన్ భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్తో కూడా సంభాషించారు. భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘుతోనూ కిర్స్టన్ మాట్లాడినట్లు సమాచారం. బ్రార్, సుతార్లతో కిర్స్టన్కు ఇప్పటికే పరిచయం ఉంది. 2022 నుంచి 2024 వరకు గుజరాత్ టైటాన్స్ జట్టులో బ్యాటింగ్ కోచ్, మెంటర్గా పనిచేసిన సమయంలో వీరిద్దరూ నెట్ బౌలర్లుగా ఆ జట్టులో ఉన్నారు. దీంతో వారితో కిర్స్టన్కు ప్రత్యేక అనుబంధం ఉంది. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్లుగా నిలిపిన కోచ్ గ్యారీ కిర్స్టన్కు భారత క్రికెట్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2008 నుంచి 2011 వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేసిన ఆయన.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర