వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడటం కోసం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన భారత్.. సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు, 1 ఫోర్తో 15 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో నాలుగు సిక్సర్లు కొట్టిన సిరాజ్.. లాస్ట్ ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదడం విశేషం.వార్మప్ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్లో భారత్ విజయానికి 207 పరుగులు అవసరం అయ్యాయి. మ్యా్చ్ చివరి రోజు ఫైనల్ ఓవర్ ప్రారంభమయ్యే సరికి భారత్ 191/4తో నిలిచింది. టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. సిరాజ్తోపాటు ఆల్రౌండర్ సారాంశ్ జైన్ క్రీజ్లో ఉన్నారు. సిరాజ్ సింగిల్ తీసిస్తే.. మ్యాచ్ను ముగించాలని సారాంశ్ భావించి ఉంటాడు. కానీ సిరాజ్ మియా మాత్రం మరోలా ఆలోచించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు.అప్పటికే భారత జట్టు గెలిచింది. కానీ వార్మప్ మ్యాచ్ల్లో పెద్దగా రూల్సేమీ ఉండవు కాబట్టి.. ఆ ఓవర్ ముగించడం కోసం శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ నువాంతా బౌలింగ్ కొనసాగించాడు. నాలుగో బంతికి వదిలేసిన సిరాజ్.. ఐదో బంతిని బౌండరీగా మలిచి మ్యాచ్ను ముగించాడు. అంతకు ముందు దినుష వేసిన ఓవర్లోనూ సిరాజ్ ఓ సిక్సర్ బాది తన సత్తా ఏంటో చాటాడు.‘లార్డ్స్’ ఓటమితో సిరాజ్లో పెరిగిన కసి..2025 జులైలో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ విజయానికి 22 పరుగుల దూరంలో ఉండగా.. ఇంగ్లాండ్ గెలవడానికి ఒక వికెట్ అవసరమైంది. ఈ ఇన్నింగ్స్లో పదకొండో నంబర్ బ్యాటర్గా క్రీజ్లోకి వచ్చిన సిరాజ్.. రవీంద్ర జడేజాకు సహకరిస్తూనే పట్టుదలతో బ్యాటింగ్ చేసి 30