Dharmendra Pradhan NEET Resignation : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి, సంబల్పూర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ నిరసనల సమయంలో 'జెన్ జీ'ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం కారణంగానే తాను కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల భారీ నిరసనల మధ్య జూలై 25వ తేదీన ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా రెండు వారాల తర్వాత భువనేశ్వర్లోని జీఎం విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పదవి కన్నా యువత భవిష్యత్తే ముఖ్యం..!నీట్ అభ్యర్థులు, ప్రస్తుత తరం యువతను ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ధర్నాలు చేసిన జెన్ జీలు కూడా మన పిల్లలే. కానీ కొందరు కావాలనే వారిని తప్పుదోవ పట్టించారు. అప్పట్లో నాకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవు. భారత దేశంలో ప్రతి ఏడాదీ కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. గత పదేళ్ల లెక్కలు తీసుకుంటే 20 కోట్ల మంది పిల్లలు పుట్టారు. వారందరికీ ఎన్నో ఉన్నతమైన ఆకాంక్షలు ఉంటాయి. వారే భవిష్యత్తులో భారతదేశాన్ని విశ్వ గురుగా నిలబెడతారు. అందుకే నాకు పదవి ఏమాత్రం ముఖ్యం కాదు" అని ప్రధాన్ వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి.. కేంద్ర మంత్రిమండలి నుంచి తన రాజీనామాను సమర్పించినట్లు ఆయనవెల్లడించారు.నవీన్ పట్నాయక్పై తీవ్ర విమర్శలు..!అనంతరం రైరాఖోల్లో జరిగిన మరో సమావేశంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు