
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు ఈ-మెయిల్లో తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు (Uday Krishna Reddy case) సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు (Nageswara Rao) సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు ఈ-మెయిల్లో తెలిపారు. ఈ కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞ చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పలు కీలక ప్రశ్నలను నాగేశ్వరరావు లేవనెత్తారు. పోష్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే అరెస్టు ఎందుకు చేశారని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు సమయంలో నిందితుడు దర్యాప్తునకు సహకరించరా?, సాక్షులను ప్రభావితం చేస్తాడా?, పరారయ్యే అవకాశముందా? వంటి అంశాలను పరిశీలించారా అని నిలదీశారు. తొలుత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు లేవని ప్రస్తావించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తీవ్ర ఆరోపణలు చేర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించారని ఆరోపణలపై ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తుపై తలెత్తిన అనుమానాలకు స్వతంత్ర విచారణతోనే తెరపడుతుందని డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు