
ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. స్కిమ్ మిల్క్ పొడి, పామాయిల్, సువాసన ‘రసాయనాల’తో తయారీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హెచ్-ఫాస్ట్ పోలీసుల దాడులు 36 టన్నుల కల్తీ నెయ్యి, రసాయనాలు స్వాధీనం నివేదికల ఆధారంగా కేసుల నమోదు.. చట్టపరంగా చర్యలు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్-ఫాస్టు పోలీసులకు సీపీ అభినందన, రివార్డులు హైదరాబాద్ సిటీ: ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల భారీ ఎత్తున కల్తీ మసాలాలను పట్టుకున్న హెచ్-ఫాస్టు పోలీసులు, ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్లోని 39 కల్తీ తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాల (130 ప్రాంగణాలు)పై సంయుక్తంగా దాడులు చేసి 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, మూడు రకాల సువాసన బాటిళ్లు ఆరు, రవ్వతోపాటు పిండి 30 కిలోలు ఉన్నాయి. జప్తు చేసిన వస్తువులను టెస్టింగ్ కోసం ల్యాబ్లకు, ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించినట్లు మంగళవారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ విజయ్కుమార్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి తయారీ దారులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మిల్క్ క్రీమ్ తెప్పిస్తున్నారు. పాలు లేకుండా జీరో ఫ్యాట్ కల