
మన పొరుగుదేశం నేపాల్ పై ఇటీవల ప్రకృతి కన్నెర్రజేసిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా సంభవించిన వరదలతో వందలాది ప్రాణాలు బలయ్యాయి... వేలాదిమంది గల్లంతయ్యారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ వరదలు కొంతమంది విదేశీయుల ప్రాణాలను బలితీసుకున్నాయి.. ఇందులో అత్యధికులు భారతీయులే. ఈ భయంకర వరదల సమయంలో చాలామంది ఇండియన్స్ నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు... వీరిలో కొందరు వరదల భారిన పడ్డారు. ఈ క్రమంలో అత్యధికమంది భారతీయులు నేపాల్ లో సందర్శించే పర్యాటక ప్రాంతాలేవో ఇక్కడ తెలుసుకుందాం. సాహస ప్రియులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నేపాల్లోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాల్లో ఒకటి. ఈ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ లో పర్వత గ్రామాలు, వేలాడే వంతెనలు, హిమానీనదాలు, కఠినమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రయాణం సాధారణంగా ఖాట్మండు నుంచి లుక్లాకు విమానంలో మొదలవుతుంది. అక్కడి నుంచి షెర్పా గ్రామాలు, సాగర్మాథా నేషనల్ పార్క్ గుండా నడవాలి. మౌంట్ ఎవరెస్ట్, సమీప శిఖరాల అద్భుతమైన దృశ్యాల కోసం కాలా పత్తర్ అనే ప్రదేశంలో చాలామంది ఆగుతారు. ఇక్కడికి మార్చి నుంచి మే, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య ఎక్కువగా వెళుతుంటారు. మంచు పర్వతాల నుంచి కాస్త విరామం కావాలంటే చిత్వాన్ నేషనల్ పార్క్ మంచి ఆప్షన్..ఇది నేపాల్లోని కొత్త కోణాన్ని చూపిస్తుంది. దక్షిణ టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఈ యునెస్కో గుర్తింపు పొందిన పార్క్ దట్టమైన అడవులు, పచ్చిక బయళ్లు, చిత్తడి నేలలకు ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడ జీప్ సఫారీలు చేయవచ్చు… రాప్తీ నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు లేదా గైడ్లతో అడవిని అన్వేషించవచ్చు. ఈ పార్క్లో బెంగాల్ టైగర్లు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, మొసళ్లు, ఏనుగులు, అనేక పక్షి జాతులు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో థారు తెగ ప్రజల సంప్రదాయాలను కూడా తెలుసుకోవచ్చు. జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడికి వెళ్లడానికి సరైన సమయం. ఖాట్మండు లోయలో ఉన్న భక్తపూర్ ఒక