
ప్రతీ గ్రామ పంచాయతీకి డిజిటల్ ప్రొఫైల్ జనాభా నుంచి నీటి వనరుల వరకు సమాచార సేకరణ గ్రామాభివృద్ధి కోసం మూడేళ్ల ప్రణాళికలు జిల్లాలో మొదలైన డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు వరంగల్ సిటీ: గ్రామాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైంది. జీపీలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్ ప్రొఫైల్లో నమోదు చేస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడి అవసరాలు, వనరులు, సమస్యలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతీ పంచాయతీ కి ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్ను రూపొందిస్తోంది. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం తోపాటు ప్రస్తుత అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భవిష్యత్ ప్రణాళికలను సైతం ఇందులో పొందుపరుస్తారు. వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితి, కుటుంబాల సంఖ్య, వ్య వసాయ భూములు, సాగునీటి వనరులు, రహదారుల పరిస్థితి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి కూలీలు వంటి వివరాలన్నీ ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, ప్రస్తుత పనులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలనూ డిజిటల్ ప్రొఫైల్లో పొందు పరుస్తున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృది శాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఈ డిజిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని వివరాలు ప్రొఫైల్లో.. గ్రామపంచాయతీ ప్రొఫైల్లో భౌగోళిక వివరాల నుంచి ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వరకు సమాచారం పొందుపరుస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన గ్రామస్థాయి ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే