
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొంది, ఈపీఎఫ్ చట్టం ప్రకారం అధికారిక మినహాయింపు ఉత్తర్వులు లేని పీఎఫ్ ట్రస్టుల కోసం వన్ టైమ్ పరిష్కార పథకాన్ని (అమ్నెస్టీ స్కీమ్) ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ట్రస్టులు తమ మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించుకునేందుకు డిసెంబర్ 28వ తేదీ వరకు గడువు విధించింది.ఈ మేరకు 2026 జూన్ 29న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం-1961 కింద గుర్తింపు ఉండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ (ఈపీఎఫ్&ఎంపీ) యాక్ట్- 1952లోని సెక్షన్ 17 లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ (సీఓఎస్ఎస్), 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు లేని పీఎఫ్ ట్రస్టులకు ఈ అమ్నెస్టీ పథకం వర్తిస్తుంది. ఇది ఒక పరివర్తన చర్యగా, ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పథకం అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలతో ఈపీఎఫ్ఓ 2026 జులై 11న ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఈ పథకం ద్వారా ట్రస్టులు తమ హోదాను గడిచిన కాలానికి కూడా వర్తించేలా క్రమబద్ధీకరించుకోవచ్చు. దీంతో పాటు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020లో నిర్దేశించిన పలు నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా కనీస ఉద్యోగుల