
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. హైదరాబాద్, కడప నగరాల్లోని దాదాపు ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. హైదరాబాద్, కడప నగరాల్లోని దాదాపు ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. ఏడేళ్ల తర్వాత ఈడీ ఎంట్రీ కావడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. మరో వైపు ఇటీవల తన తండ్రి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె వైఎస్ సునీత.. రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం విదితమే
.