
స్వాతంత్ర్య సంబరాల వేళ గుజరాత్ అటవీ శాఖ ఒక అద్భుతమైన పర్యావరణ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యమొచ్చి 80 ఏళ్లు పూర్తయిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఒకప్పుడు కళకళలాడి కాలక్రమేణా బోసిపోయిన బన్నీ గడ్డిభూములకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ జామనగర్ వంతారా పునరావాస కేంద్రం సహకారంతో ఏకంగా 20 కృష్ణజింకలను కచ్లోని సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా వదిలిపెట్టారు.ఆడ, మగ జింకల కొత్త ప్రయాణంఈ విడతలో మొత్తం 5 మగ జింకలు, 15 ఆడ జింకలను అడవిలో విడిచిపెట్టారు. జామనగర్లోని వంతారా కేంద్రాం నుంచి వీటిని కచ్ ప్రాంతానికి తీసుకురావడానికి ముందు కేంద్ర జూ అథారిటీ నుంచి అన్ని అనుమతులు సాధించారు. సుదూర ప్రయాణంలో జింకలకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక వెటర్నరీ వైద్యుల సమక్షంలో, పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అత్యంత జాగ్రత్తగా ఇక్కడికి తరలించారు.జీవావరణ వ్యవస్థకు కొత్త ఊపిరిఒకప్పుడు ఈ బన్నీ గడ్డిభూముల్లో కృష్ణజింకలు, చింకారా, నీల్గాయ్ వంటి జంతువులు విరివిగా సంచరించేవి. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోవడంతో ఇక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. ఇప్పుడు ఈ 20 జింకల రాకతో ఇక్కడ ఆహారపు గొలుసు మళ్లీ బలోపేతం కానుంది. భవిష్యత్తులో క్రూర మృగాలకు తగినంత ఆహారం లభించడంతో పాటు, గడ్డిభూముల సహజ సమతుల్యత దారిన పడుతుందని అధికారులు భావిస్తున్నారు.70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..ప్రాజెక్ట్ చీతా దిశగా మరో అడుగుభారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడనుంది. శాస్త్రీయ పద్ధతులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అటవీ ప్రాంతాలను తిరిగి అభివృద్ధి చేయవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రాబోయే రోజుల్లో బన్నీ ప్రాంతం మళ్లీ పచ్చటి జీవవైవిధ్యంతో కళకళలాడుతుందని అటవీ శాఖ తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తోంది.చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో