
నేడు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెగా సిటీగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కీలకమైన వ్యాపార కేంద్రంగా దుబాయ్ వెలుగుగొందుతోంది. అయితే, సరిగ్గా 1947 స్వాతంత్ర్య సమయానికి ముందు చరిత్ర ఇంకో మలుపు తిరిగి ఉంటే... నేడు దుబాయ్ భారతదేశంలోనో లేదా పాకిస్తాన్‌లోనో ఒక భాగంగా ఉండేది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇది ముమ్మాటికీ నిజమంటున్నారు ప్రముఖ చరిత్రకారుడు శామ్ డాల్రింపుల్. ఆయన రాసిన ష్యాటర్డ్ ల్యాండ్స్ పుస్తకం ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఈ నిజాలు ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.ఢిల్లీ కేంద్రంగా సాగిన అరబ్ పాలకుల పాలనఒకప్పుడు అరబ్ ప్రాంతాలు నేరుగా బ్రిటన్ రాజధాని లండన్ నుంచి కాకుండా, బ్రిటిష్ ఇండియా రాజధాని అయిన ఢిల్లీ నుంచే పాలించబడేవి. పర్షియన్ గల్ఫ్ పరిధిలోని అనేక అరబ్ సంస్థానాలు, రక్షణ ప్రాంతాలు వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేసేవి. 1889 నాటి అప్పటి చట్టాల ప్రకారం కువైట్, అడెన్, అబుదాబి వంటి ప్రాంతాలను చట్టబద్ధంగా భారతదేశంలో భాగంగానే భావించేవారు. ఎంతలా అంటే, అబుదాబి పేరు భారత్‌లోని స్వదేశీ సంస్థానాల అధికారిక జాబితాలో ఉండేది. అలాగే అప్పట్లో అక్కడి ప్రజలకు ఇండియన్ ఎంపైర్ పాస్‌పోర్ట్లను సైతం జారీ చేసేవారు. రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో నెహ్రూ సర్కార్ వద్దన్నాక తీరిన ఆశలు1947లో భారత్, పాకిస్తాన్‌లు విడిపోతున్న తరుణంలో, బ్రిటీష్ అధికారుల ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి పడింది. భారత్ వీడి వెళ్తున్న దొరలు, పర్షియన్ గల్ఫ్ లోని ఈ అరబ్ ప్రాంతాల బాధ్యతను కాబోయే భారత ప్రభుత్వానికి లేదా పాకిస్తాన్‌కు అప్పగిద్దామని భావించారు. అయితే, ఆ సమయంలో ఢిల్లీలోని భారత అధికారులు, అప్పటి పాలకులు గల్ఫ్ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సముద్రం దాటి ఉన్న ఆ ప్రాంతాలను నిర్వహించడం భారత్‌కు పెద్దగా ప్రయోజనకరం కాదని భావించడంతో, ఈ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?ఏప్రిల్ 1న తెగిపోయిన బంధంభారత ప్రభుత్వం నుంచి ఆసక్తి లేకపోవడం, మరోవైపు అరబ్ ప్రజలను భారతీయులు లేదా పాకిస్తానీయుల పాలన కిందకు తీసుకురావడం సరికాదని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు స్వాతంత్ర్యానికి కొద్ది నెలల ముందు, అంటే 1947 ఏప్రిల్ 1న, గల్ఫ్ ప్రాంతాలను బ్రిటిష్ ఇండియా పరిపాలన నుంచి పూర్తిగా వేరు చేసింది. ఒకవేళ ఆనాడు మన పాలకులు గల్ఫ్ ప్రాంతాలను భారత్‌లో కలిపేందుకు అంగీకరించి ఉంటే, నేటి పశ్చిమ ఆసియా భౌగోళిక స్వరూపం, గల్ఫ్ దేశాల తలరాత , భారత్ ఆర్ధిక స్థితి పూర్తిగా వేరొకలా ఉండేవి.





