
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, పాపాలు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదిక ద్వారా బట్టబయలయ్యాయని, వీటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. గురువారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిట్ నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.సిట్ నివేదిక ప్రకారం, వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొన్న 158 మంది వాల్యుయేటర్లలో కేవలం 72 మందికి మాత్రమే అర్హత ఉందని, మిగిలిన వారంతా అనర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారిక వ్యవస్థను కాదని, ప్రైవేట్ జీమెయిల్ ఖాతాలు, వ్యక్తిగత ఐడీలు, డ్రైవ్ల ద్వారా వాల్యుయేషన్ నిర్వహించడం దారుణమని అన్నారు. అంతేకాకుండా, అభ్యర్థుల ఆన్సర్ షీట్లను ఓ ప్రైవేట్ రిసార్ట్కు తరలించి, సీసీ కెమెరాలు గానీ, యూనివర్సిటీ నిపుణుల పర్యవేక్షణ గానీ లేకుండా 86 రోజుల పాటు అక్కడే ఉంచి మూల్యాంకనం జరిపారని ఆరోపించారు.ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 160 మంది (96.97 శాతం) ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు జరిగాయని, మొత్తం 736 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తే 97.55 శాతం షీట్లలో దిద్దుబాట్లు కనిపించాయని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వైట్నర్ వాడకం, సంతకాలు సరిపోకపోవడం, ఒకే పేపర్లో రెండు రకాల ఇంక్ వాడటం, చీఫ్ ఎగ్జామినర్ సంతకాలలో తేడాలు వంటి అనేక అక్రమాలు తేలాయని వివరించారు. ఇవి