
Agriculture : అభివృద్ధి, టెక్నాలజీ అవసరమే... కానీ వీటికోసం జీవితాలనే పనంగా పెట్టేంత అవసరం కాదు. కానీ నేటి తరం ఇదే చేస్తోంది. ఈ అభివృద్ధి మాయలో పడి అన్నీ కలుషితం చేసేస్తున్నారు... దీంతో మనిషికి సౌకర్యాలు పెరిగాయి కానీ ఆయుష్షు తగ్గింది. అందుకే ఇప్పుడు చాలామంది సౌకర్యాలకు త్యాగం చేసి గతంలో మాదిరిగా ప్రకృతితో మమేకం అయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ''ప్రకృతి వ్యవసాయం (Natural Farming)'' బాగా ఆదరణ పొందుతోంది. మన పూర్వీకుల మాదిరిగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో భూమి సారాన్ని పెంచుతూ పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. ఇలా సహజసిద్దంగా పండించిన కూరగాయలు, ధాన్యాలు, పండ్లను తినేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు... ఇది ఇప్పుడు పెద్ద బిజినెస్ గా మారింది. అయితే ఇంతకంటే సహజసిద్దంగా పంటలు పండించే మరో కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది... అదే ''డూ నథింగ్ ఫార్మింగ్ (Do Nothing Farming)''. ప్రకృతి వ్యవసాయం మాదిరిగానే ఈ డూ నథింగ్ ఫార్మింగ్ కూడా జపాన్కు చెందిన ఒక వినూత్న వ్యవసాయ పద్ధతి. ఈ విధానం ప్రకారం... ప్రకృతి తన పనిని తాను చేసుకునేలా వదిలివేయాలి... వ్యవసాయంలో మన జోక్యం చాలా తక్కువగా ఉండాలి. భూమిని దున్నడం, కలుపు తీయడం, పురుగు మందులు వాడటం వంటి పనులను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇంకా చెప్పాలంటే అడవుల్లో చెట్లకు పండ్లు మన ప్రమేయం లేకుండా ఎలా కాస్తాయో భూమిలో పంటలు కూడా అలా పండించాలి. మనం ఏమీ చేయకుండానే పంటలు పండించడమే డూ నథింగ్ ఫార్మింగ్. ఈ వ్యవసాయ పద్దతి ద్వారా రైతులు తమ శ్రమను, ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది భూమిని సహజసిద్ధంగా సారవంతం చేసి, పంటలకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది ఆధునిక వ్యవసాయానికి భిన్నమైన మార్గం. ఇది స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతి రైతుల జీవితాల్లో