
Devdutt Padikkal: శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో అజేయంగా నిలిచి అదరగొట్టాడు. 2024 చివరిలో పర్త్ టెస్టు ఆడిన తర్వాత ఆయన మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. ఈ సుదీర్ఘ నిరీక్షణపై బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన పడిక్కల్.. బెంచ్ మీద కూర్చొని ఆటను చూడటం ఏ క్రీడాకారుడికైనా సులువైన విషయం కాదని పేర్కొన్నాడు. ఆ సమయంలో మానసికంగా బలంగా ఉంటూ తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవడానికి నిరంతరం శ్రమించానని, ఆ కష్టానికి ఈ రోజు ప్రతిఫలం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. గాలే మైదానంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉందని, విపరీతమైన చెమట పడుతూ అలసట ముంచెత్తిందని పడిక్కల్ తెలిపాడు. ముఖ్యంగా మూడో సెషన్లో శరీరం సహకరించకపోయినా వికెట్ పారేసుకోకూడదనే ఏకాగ్రతతో ముందుకు సాగానని అన్నాడు. పిచ్ బ్యాటింగ్కు అంత తేలికగా ఏమీ లేదని, అనవసరమైన షాట్లు ఆడకుండా మైదానంలో ఎక్కువ సేపు నిలబడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాడు. సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో కాస్త కంగారు పడ్డా, ఆ ఒత్తిడిని అధిగమించి సెంచరీ బాదడం కెరీర్లోనే ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి : BAN vs AUS: 23 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ సాయి సుదర్శన్ గాయం కారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న పడిక్కల్, ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. టెస్టు సిరీస్కు ముందు శ్రీలంకతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఆయన శతకంతో రాణించాడు. గాలే మైదానంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఇక్కడ గతంలో ఆడినప్పుడు కూడా మంచి పరుగులు చేశానని, ఈ వేదిక తన కెరీర్కు ఎంతో ప్రత్యేకమైనదని వివరించాడు. విజయ్