
దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు తీవ్ర కలకలం రేగింది. ఆగస్టు 14న ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. "Blast Delhi High Court@2:11 PM" అనే సబ్జెక్ట్తో వచ్చిన ఈ ఇమెయిల్లో ఖలిస్తాన్ పేరు ప్రస్తావనకు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందడి ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపు వార్త రాజధాని వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ బెదిరింపుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా ఐజీఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3, జామ్నగర్ హౌస్, ఝండేవాలన్, సాకేత్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీస్ వంటి ప్రాంతాలకు కూడా ఇమెయిల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఫైర్ సర్వీసెస్ రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పోలీసులతో మాట్లాడి ప్రాంగణమంతా సమగ్ర తనిఖీలు చేయించారు. సదరు ఇమెయిల్లో ఆగస్టు 15న హైకోర్టులో 2:11 గంటలకు, జిల్లా కోర్టుల్లో 3:11 గంటలకు పేలుళ్లు జరుగుతాయని బెదిరించారు. ఎర్రకోట, ఢిల్లీ మెట్రో, అంబాలా నుంచి వచ్చే రైళ్లు కూడా తమ లక్ష్యాలని అందులో పేర్కొన్నారు. 1984 సంఘటనలు, కోర్టుల్లో సిక్కులపై కేసులను ప్రస్తావిస్తూ బాబర్ ఖల్సా కెనడా పేరుతో ఈ మెయిల్ వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో భద్రతా దళాలు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి నిమిషనిమిషానికి పరిస్థితిని సమీక్షించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కునాల్ మల్హోత్రా పరిస్థితులపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అయినా, బాంబు స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఫలితంగా ఇది కేవలం ఒక నకిలీ బెదిరింపుగా తేలిపోవడంతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని