
ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్ (Ladakh)లోని మినామార్గ్ చెక్పోస్టు వద్ద భద్రతా సిబ్బందితో పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మిజోరం గవర్నర్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (Gen VK Singh) స్పందించారు. భద్రతా సిబ్బందిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. దేశాన్ని కాపాడే రక్షణ కవచంగా సాయుధ బలగాలు పనిచేస్తున్నాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సైనికులను అన్యాయంగా నిందించడం, నిరాధార ఆరోపణల చేయడం సరికాదన్నారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు తాము అండగా ఉంటామని చెప్పారు. మినామార్గ్ ప్రాంతంలో ఉన్న చెక్పోస్టు (Minamarg checkpoint) వద్ద వాహనాలను గంటల పాటు నిలిపివేశారని ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందిపై విరుచుకుపడింది. కుటుంబాలు, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వారిని అంతసేపు ఎందుకు నిలిపివేశారని ఆమె అక్కడి సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు. తాము ‘జెన్ జీ’ (Gen Z) తరానికి చెందిన వారమని, ఇలాంటి పరిస్థితులను అస్సలు సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భద్రతా కాన్వాయ్ అక్కడికి రావడంతో, ఆమెను రోడ్డు పక్కకు వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించారు. రహదారిని కేవలం వీఐపీ కాన్వాయ్ కోసమే మూసివేశారని సదరు పర్యాటకురాలు ఆరోపించినట్లు సమాచారం. అయితే ఆ ఆరోపణలు ఎంత వరకు నిజమనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Ladakh Tourist Video) ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భద్రత, ప్రతికూల వాతావరణం, రోడ్డు పరిస్థితుల కారణంగా మినామార్గ్-జోజిలా మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియోపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. పాత రోజుల్లో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు ‘నా తండ్రి ఎవరో నీకు తెలుసా? అంటూ బెదిరింపులకు దిగేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ‘మేము జెన్-జీ’ అనేది ఒక కొత్త