
దక్షిణామెరికా ఖండంలో భూమాత మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నిమిషాల వ్యవధిలోనే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోగా, సజీవంగా ఉన్న నగరాలు క్షణాల్లో ఇటుకల కుప్పలుగా మారిపోయాయి. తీవ్ర ప్రకంపనలతో కొలంబియా దేశం కకావికలమైంది. ప్రకటనల ప్రకారం ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉంటారని భయపడుతున్నారు.రెస్క్యూ టీమ్లు సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. 21వ శతాబ్దంలో ఈ దేశం చూసిన అత్యంత దారుణమైన భూకంపంగా ఇది చరిత్రకెక్కింది.క్షతగాత్రుల ఆర్తనాదాలు.. నిశ్శబ్దమైన నగరాలుసోమవారం నమోదైన రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం పశ్చిమ కొలంబియాను పూర్తిగా ఊపేసింది. పెరీరా, కాలీ, మానిజాలెస్, క్విబ్డో వంటి ప్రధాన నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆసుపత్రులు, రహదారులు ధ్వంసమవ్వడంతో అత్యవసర వైద్య సేవలు అందించడం కూడా సవాలుగా మారింది. సుదూర అటవీ ప్రాంతమైన చోకోలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా తెగిపోవడంతో అసలు అక్కడ ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ అంచనాకు అందడం లేదు. ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ఆర్మీతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.Earthquake: ఉలిక్కిపడ్డ న్యూజిలాండ్! సునామీ గండం?అసలు ఈ విపత్తు వెనుక కారణమేంటి?ఇంత పెద్ద భూకంపం ఎందుకు వచ్చింది? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కొలంబియా దేశం భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన టెక్టోనిక్ ప్లేట్ల కలయిక ప్రాంతంలో ఉంది. భూగర్భంలో ఉండే నాజ్కా, సౌత్ అమెరికన్ ప్లేట్లు నిరంతరం ఒకదానినొకటి ఢీకొంటూ ఉంటాయి.భూమి అడుగున దాదాపు 107 కిలోమీటర్ల లోతున ఇరుక్కుపోయిన భారీ రాతి పొరలు ఒక్కసారిగా పక్కకు జరగడం వల్ల తీవ్ర శక్తులు విడుదలయ్యాయి. లోతు ఎక్కువగానే ఉన్నప్పటికీ, భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో భూమి ఉపరితలంపై తీవ్ర విధ్వంసం సంభవించింది. ప్రధాన భూకంపం తర్వాత కూడా మరో 21 సార్లు ఆఫ్టర్ షాక్స్ రావడంతో జనాలు ఇళ్లల్లోకి