తెలంగాణలో గ్రామీణ రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న తొలి దశ రహదారి పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 16న ములుగులో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీనిమరింత మెరుగుపరిచే లక్ష్యంతో మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,162 రహదారులను ఆధునీకరించనున్నారు. ఇందుకోసం రూ.16,007.56 కోట్ల అంచనా వ్యయంతో 7,450 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. గ్రామాలను మండల కేంద్రాలు, మార్కెట్లు, విద్యా, వైద్య సదుపాయాలు, ఇతర ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించడంలో ఈ రహదారులు కీలకంగా మారనున్నాయి.ఈ ప్రాజెక్టును హ్యామ్ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ వ్యయంలో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన 60 శాతాన్ని నిర్మాణ సంస్థలు సమకూర్చనున్నాయి. ప్రభుత్వ వాటాను ఒక్కసారిగా చెల్లించకుండా 15 ఏళ్ల కాలంలో 30 విడతలుగా చెల్లించే విధానం అమలు చేయనున్నారు. దీంతో ప్రభుత్వంపై ఒకేసారి భారీ ఆర్థిక భారం పడకుండా దీర్ఘకాలికంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు నిర్మాణ సంస్థలు తమకు అప్పగించిన రహదారి పనులను 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 15 ఏళ్లపాటు ఆయా రహదారుల నిర్వహణ, నాణ్యత పరిరక్షణ బాధ్యతను సంబంధిత సంస్థలే చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల రహదారుల నిర్మాణంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణకు కూడా ప్రాధాన్యం లభించనుంది.పంచాయతీరాజ్ శాఖ తాజా వివరాల .. రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాలను మెరుగైన రోడ్డు నెట్వర్క్తో అనుసంధానించాలనే లక్ష్యంతో హ్యామ్ ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో ఇప్పటికే