
CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, తలసరి ఆదాయంలో టాప్లో ఉన్నామని అన్నారు. గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని నిర్ణయించామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమ కోసం అనేక పథకాలు చేపట్టామని, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఇలా.. అన్ని విషయాల్లో రైతులకు అండగా నిలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టించిందని అన్నారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపే లక్ష్యంతో ఆగస్టు 17నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం ఈ ప్రజావాణి జరుగుతుందని, త్వరలో ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ప్రజలు తమ అర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అర్జీల పరిష్కార పురోగతిని ప్రత్యేక డ్యాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక వసతులు కీలకమని