© 2026 nimisham.in

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం నేతృత్వంలోని తెలంగాణ బృందం కెనడాలో పర్యటించాలని ప్రతినిధులు ఆహ్వానం పలికారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు కెనడా కంపెనీలకు సీఎం ఆహ్వానం పలికారు. తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు కెనడా ప్రతినిధులు ఆసక్తి చూపించారు. మూసీ రివర్ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీపై కెనడా ప్రతినిధులతో సీఎం కీలక చర్చలు జరిపారు. హరిత ఆర్థిక వ్యవస్థ, సౌర విద్యుత్ రంగాల్లో కెనడా సహకారం కోరారు సీఎం. హైదరాబాద్లో కెనడా యూనివర్సిటీల మల్టీ-క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్లో తెలంగాణ పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణపై కెనడా కంపెనీల విశ్వాసం పెరుగుతోందని సీఎం రేవంత్, క్రిస్ కూటర్ తెలిపారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణను హైకమిషనర్ ప్రశంసించారు. ఇంధనం, పట్టణాభివృద్ధి, డిఫెన్స్ రంగాల్లో కెనడా ట్రేడ్ డెలిగేషన్ త్వరలో తెలంగాణకు రానుందని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని కెనడా ప్రతినిధులు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసిన అంతర్జాతీయ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని అంతర్జాతీయ ప్రతినిధులు కలిశారు. నిలి గిల్బర్ట్ (USA): బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బోర్డు సలహాదారు, మహేశ్ కొండూరు (USA): అమెరికా ప్రభుత్వ సలహాదారు (critical minerals) మొమెంటం టెక్నాలజీస్ సీఈఓ, అమిత్ మెహ్రా (UK): ఆక్సన్ టెక్నాలజీస్ సీఈఓ, దిలెక్ , నార్వే మాజీ స్టేట్ సెక్రటరీ, థామస్ ఫ్రోలిక్, దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు, సెంథిల్ తొండమాన్, సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ (CWC) అధ్యక్షుడు( శ్రీలంక) సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. డిజిటల్
గవర్నెన్స్తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
Read Latest Telangana News And AP News And National News